Medak: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

ప్రభుత్వ పాఠశాలలే విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు నిలయాలు

On
Medak: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

మెదక్ జిల్లా డీఈవో డి. రాధా కిషన్

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

మెదక్ జిల్లా డీఈవో డి. రాధా కిషన్

మెదక్, రాజముద్ర వెబ్ డెస్క్:

మెదక్ జిల్లా (Medak District ) అల్లాదుర్గ్(Alladurg) మండలం ముస్లాపూర్(Muslapur) పాఠశాలలో బడిబాట (Badibata) కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి(District Educational Officer) డి రాధా కిషన్(Radha Kishan), ముస్లాపూర్, బహిరన్ దిబ్బ, బర్దిపూర్, ముస్లాపూర్ గిరిజన తండా కు సంబంధించిన విద్యార్థుల తల్లిదండ్రులు హాజరై పాఠశాలను సందర్శించి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... ప్రభుత్వ పాఠశాలలే విద్యార్థులకు బంగారు భవిష్యత్తుకు నిలయాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నందున విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులకు భారం కాకుండా ప్రభుత్వం గుణాత్మక విద్యను అందిస్తుందని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధించే నాణ్యమైన విద్యను విద్యార్థులు అందిపుచ్చుకొని సామాజికంగా ఆర్థికంగా ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. జ్ఞానమే నేటి సమాజంలో మన స్థాయిని నిర్ణయిస్తుందని జ్ఞానాన్ని అర్జించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న విద్యా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. యువత అనేక వ్యసనాలకు బానిసలుగా మారి భవిష్యత్తును వృధా చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు .విద్య ద్వారా మంచి చెడుల విచక్షణ తెలుస్తుందని అన్నారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోని చేర్పిస్తే వారికి బంగారు భవిష్యత్తు ఉంటుందని డి ఈ ఓ తెలిపారు. తల్లిదండ్రుల సమావేశానికి మంత్ర ఫౌండేషన్, నిక్షిత్, ఆని పరిశీలకులు హైదరాబాద్ నుండి రావడం జరిగింది. తల్లిదండ్రుల సమావేశం నిర్వహణను పరిశీలించారు. సమావేశ నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, దుస్తులు ,నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అల్లాదుర్గం మండల విద్యాధికారి ధనుంజయ గౌడ్, కాంప్లెక్స్ హెచ్ఎం లక్ష్మణ్, ప్రధానోపాధ్యాయులు రమేష్, గ్రామపంచాయతీ సెక్రటరీ నాగరాజు, అంగన్వాడి కార్యకర్తలు, పాఠశాల ఏ ఏ పి సి చైర్మన్ ఇప్ప రాదా, ఉపాధ్యాయులు జనార్ధన్, సంజీవయ్య, దీన, ఆంజనేయులు, అరుణ, రాజరత్నం, రుక్మిణి, సంతోష్, శ్రీకాంత్, క్రాంతి, రాధిక, దేవానంద్, యాదయ్య, దుర్గయ్య, జయమ్మ, సంధ్యారాణి, సరిత తదితరులు పాల్గొన్నారు.

Also Read:  Bheemadevarapally, Mulkanoor: శ్రీకృష్ణదేవరాయ పదో తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 

IMG-20250612-WA0079

Also Read:  Bheemadevaraplly, Mangalapalli: అక్రమంగా తరలిస్తున్న దూడలు పట్టివేత 

Views: 12
Tags:

About The Author

Latest News