Bheemadevarapally, kothakonda: అక్రమ పట్టా చేసుకొని గోస పెడుతుండు
ఓ మాతృమూర్తి ఆవేదన..

అధికారులు న్యాయం చేసేనా..?
అక్రమ పట్టా చేసుకొని గోస పెడుతుండు
-ఓ మాతృమూర్తి ఆవేదన..!
-అధికారులు న్యాయం చేసేనా..?
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
తాను సంపాదించిన భూమిని తన కొడుకు అక్రమంగా పట్టా చేసుకున్నాడని, ఆ భూ పట్టాను రద్దు చేయాలని ఓ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సంఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ గ్రామంలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన జుర్రు కొమురమ్మకు పోచయ్య, సంపత్, లింగయ్య ముగ్గురు కుమారులు ఉన్నారు. రెండో కుమారుడు సంపత్ గ్యాస్ కనెక్షన్ కోసమని కొమురమ్మను తీసుకువెళ్లి 7 గుంటల భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నాడు. ఈ విషయమై గత కొన్ని సంవత్సరాల నుంచి వారి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అధికారులు ఇరువురిని నెల రోజుల క్రితం బైండోవర్ చేసి, కౌన్సిలింగ్ నిర్వహించారు. కాగా తాను సంపాదించిన ఆస్తి ముగ్గురు కొడుకులకు చెందుతుందని, కానీ రెండో కుమారుడు సంపత్ దానిని అక్రమంగా పట్టా చేసుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తన గోడును మీడియాతో వెల్లబోసుకుంది. అక్రమంగా చేసుకున్న భూ పట్టాను రద్దు చేయాలని రెవెన్యూ అధికారులను కోరింది.