Bheemadevarapally, Kotthapally: నిమజ్జనానికి తరలిన కొత్తపల్లి గణనాథుడు
On

ఆకట్టుకున్న మహిళల కోలాటం
నిమజ్జనానికి తరలిన కొత్తపల్లి గణనాథుడు
ఆకట్టుకున్న మహిళల కోలాటం
భీమదేవరపల్లి రాజముద్ర డెస్క్:
మండలం లోని కొత్తపల్లి గ్రామంలో ప్రతిష్ఠించిన వినాయకుని ఐదు రోజుల పూజల అనంతరం నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా సోమవారం గణనాథుని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో శోభాయాత్రగా పురవీధుల గుండా ఊరేగించారు. మహిళలు కోలాటం, యువకులు నృత్యాలు చేస్తూ భాజా భజంత్రీలతో చెరువుకు తరలించారు. గత నాలుగు సంవత్సరాల నుండి గోల్డ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మట్టి గణనాథుని ప్రతిష్టాపిస్తున్నారు . ఐదు రోజులకే ప్రత్యేక పూజలు నిర్వహించి సాంప్రదాయంగా నిమజ్జనం చేస్తారు. ఈ గ్రామంలో మట్టి వినాయకుడు ప్రత్యేక ఆకర్షణ.గణపతి పల్లకి సేవలో టేకుమట్ల అశోక్, అందే శ్రీనివాస్,హేమంత్,గుడికందుల సాయికిరణ్,ఆదరి హర్షవర్ధన్,కుంటి ప్రశాంత్, భుషకే సమ్మయ్య,రాజు తదితరులు పాల్గొన్నారు.
Views: 123
Tags:
About The Author
Related Posts
Latest News
02 Sep 2025 18:58:17
పొగాకు ఉత్పత్తులను విక్రయించిన, సరఫరా చేసిన కఠిన చర్యలు